భట్టి విక్రమార్క మంచోడు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. 107 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ పోయిందన్నారు. అందరూ దుప్పటి కప్పుకుని పడుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఒక్క హుజురాబాద్ తో ఏమైనా తలక్కిందులు అవుతుందా..? అంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ తన బాధలు ప్రపంచ బాధలు అనుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఫార్ములనే బీజేపీ, కాంగ్రెస్ లు హుజురాబాద్ లో అమలు చేస్తున్నాయన్నారు.

జీవన్ రెడ్డి నియోజకవర్గం జగిత్యాలలో కాంగ్రెస్ కు ఓట్లు ఎందుకు రాలేదు..కాంగ్రెస్ లో పీసీసీ నే గట్టి అక్రమార్కులదే నడుస్తోందన్నారు. భట్టి మంచోడు ఆయనది కాంగ్రెస్ లో ఏం నడుస్తలేదు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు.. షర్మిల చేసుకోవచ్చు..అంటూ కేటీఆర్ అన్నారు. ఈనెల 15 తర్వాత మేము ఒక టీం తమిళనాడు కు వెళుతున్నామని చెప్పారు. అక్కడ డీఎంకే, ఐడిఎంకే పార్టీల నిర్మాణం పై అధ్యయనం చేస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news