దుబ్బాకలో BRS జెండాను ఎగురవేయాలి: కేటీఆర్

-

తెలంగాణ అసీంబ్లీ ఎన్నికలకు ఇంకా కేవలం తొమ్మిది రోజులు సమయం మాత్రమే ఉంది. అధికారంలో ఉన్న BRS ఎలాగైనా మళ్ళీ పీఠాన్ని దక్కించుకోవాలన్న ఆతృతలో ప్రచారాన్ని చాలా జోరుగా కొనసాగిస్తోంది. ఇక తాజాగా కేటీఆర్ దుబ్బాకలో ప్రచారంలో పాల్గొనగా, ఈ సారి జరగనున్న ఎన్నికల్లో BRS కు మీ అమూల్యమైన ఓటును వేయాలంటూ కేటీఆర్ ప్రజలను కోరారు. ఇక దుబ్బాక అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడి గురించి కూడా కేటీఆర్ ఇక్కడ ప్రస్తావించారు, గెలిచే దమ్ము దైర్యం లేక దొంగ దారిలో కత్తితో పొడిచిన కాంగ్రెస్ బీజేపీ లను ఓటు పోటుతో పొడిచి పొడిచి ఓడించాలి అంటూ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మీరేమి చేస్తారో నాకు తెలియదు డిసెంబర్ 3వ తేదీన దుబ్బాకలో BRS జెండా ఎగరాలి అంటూ కేటీఆర్ టార్గెట్ సెట్ చేశాడు.

మరి దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే గా ఉన్న రఘునందన్ ను ఓడించే సత్తా కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఉందా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికలు వచ్చే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news