KTR’s hot comments on Kaleshwaram: కాళేశ్వరంపై KTR హాట్ కామెంట్స్ చేశారు. గుజరాత్లో ఒక పెద్ద బ్రిడ్జి కూలి పోయి 140 మంది చనిపోతే ఏ NDSA పోదు, ఏజెన్సీ పోదని పేర్కొన్నారు. బీహార్లో నాలుగు రోజులకి ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాధుడు లేడు… అదే తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టం జరిగితే NDSA రాడు, ఎవడు రాడని పేర్కొన్నారు. అలానే SLBC టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడరన్నారు.

వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు… అలానే పెద్ద వాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకు పోయినా అడిగేవాడు లేడని తెలిపారు. కానీ కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాడు రెండు రొజ్జులో NDSA రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారు చేశారని వివరించారు కేటీఆర్.