కేటీఆర్ పేరు జోసెఫ్ గోబెల్స్ గా మార్చుకోవాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేవలం కమీషన్ల కక్కుర్తి కోసం బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను తీసేసి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..మేడిగడ్డకు వెళ్లి మాపై బురదజల్లే ప్రయత్నం మంచిదికాదని ఆయన అన్నారు. హడావుడిగా ఒక మనిషి సెంట్రిక్‌గా కాళేశ్వరం పనులు జరిగాయని ధ్వజమెత్తారు.

కేటీఆర్, కేసీఆర్ మీరందరు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వతంత్ర భారత దేశంలో ఇంత ఘోర తప్పిదం ఎక్కడా, ఎవరూ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కేటీఆర్‌ అనాలోచితంగా మాట్లాడుతున్నారని,కేటీఆర్ పేరు జోసెఫ్ గోబెల్స్ గా మార్చుకోవాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news