డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో యాక్సిడెంట్.. ఏఎస్సై మృతి

-

హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి నిన్న పొద్దుపోయాక మృతి చెందారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ నెల 27వ తేదీ శనివారం నాడు నిజాంపేట వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మందేసిన ఒక మందుబాబు కారుతో ఢీకొనడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. నిజాంపేట వద్ద మందేసిన సృజన్ అనే యువకుడు ట్రాఫిక్ పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వేగంగా వెనక్కి రావాలని చూసి రివర్స్ కొట్టాడు, అయితే వెనుక ఉన్న మరో కారును ఢీ కొట్టాడు.

ఈ క్రమంలో మళ్లీ వెంటనే ముందుకు వచ్చాడు, దీంతో అక్కడున్న హోంగార్డుకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో సృజన్‌కు ఆల్కహాల్ టెస్టు చేయగా 170 రీడింగ్ వచ్చింది దీంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారమిచ్చారు. డ్యూటీలో భాగంగా అక్కడికి వెళ్లి విషయం అడిగి తెలుసుకుంటున్న సమయంలో మరో మందు బాబు ఏఎస్సైను కారుతో ఢీ కొట్టాడు. ఆయన తలకు తీవ్రంగా గాయాలవడంతో వెంటనే మహిపాల్ రెడ్డిని హాస్పటల్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మహిపాల్ రెడ్డి రాత్రి కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Latest news