వచ్చే ఎన్నికల్లో అరవింద్, బండి సంజయ్ గెలవరు – కూనంనేని

-

సీపీఐ కార్యదర్శి కూనమనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్.. బండి సంజయ్ గెలబోరని.. ఒకటి, రెండు…ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అవుతుంది బీజేపీ అని అంచనా వేశారు సీపీఐ కార్యదర్శి కూనమనేని సాంబశివరావు. నేను ఏదో అనుకున్నా కానీ.. బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఒక్క ఎంపీ సీటు కూడా తెలంగాణ లో రాదని తేల్చి చెప్పారు.

రాజాసింగ్..గాడ్సే బొమ్మ తో హైదరాబాద్ లో ఊరేగించారు.. అయినా కేసు లేదన్నారు. రాహుల్ గాంధీ ..ప్రతి దొంగ పేరు మోడీ లే ఉన్నారు అని అన్నారు.. తప్పేంటి అని నిలదీశారు. రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అని అడిగినా బీజేపీ నేతపై కేసు లేదని తెలిపారు. రాహుల్ గాంధీ అనడం ఏంటి.. నేతాజీ అని ఎందుకు పెట్టుకోలేదు అంటూ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. 65 కోట్ల కుంభకోణం తో రాజీవ్ గాంధీ రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. లక్షల కోట్లు ఆధాని మింగేస్తే… మోడీ మాత్రం మాట్లాడరు.. బ్యాంకులను మోసం చేసిన వారి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్‌ చేశారు సీపీఐ కార్యదర్శి కూనమనేని సాంబశివరావు.

Read more RELATED
Recommended to you

Latest news