కర్నూల్ లో టీడీపీ అభ్యర్థి చొక్కా విప్పించిన పోలీసులు !

-

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. అయితే కర్నూలు జిల్లా ఆదోని మునిసిపాలిటీకి సంబంధించి టీడీపీ ఒకటో వార్డు అభ్యర్థి భర్త వెంకటేష్ పచ్చ చొక్కా వేసుకున్నాడు..దీంతో ఆ చొక్కా విప్పించిన పోలీస్ లు వేరే రంగు చొక్కా తెప్పించి తొడిగారు.

ఇక కర్నూలు జిల్లా సహా మున్సిపల్ కార్పొరేషన్ లో పోలింగ్ చాలా మందకొడిగా కొనసాగుతోంది. ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో సరైన లైటింగ్ ,వెలుతురు లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎన్నికల అధికారుల అలసత్వం వల్ల క్యూలైన్ మందకొడిగా సాగుతోంది. దీంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news