ఎంట‌ర్‌టైన్‌మెంటే సేఫ్: “యువ” మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ గా ఎన్టీఆర్ స‌తీమ‌ణి!

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి మీడియా రంగంలోకి అడుగు పెట్ట‌బోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు హల్ చల్ చేస్తున్నాయి. వస్తోన్న స‌మాచారం మేర‌కు త్వ‌ర‌లోనే ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ఓ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ ఛానెల్‌ కు మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. “యువ” అనే పేరుతో ఈ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ ఛానెల్ ప్రేక్ష‌కులను అల‌రించ‌నుందంటున్నారు. ఈ ఛానెల్‌ కు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ట‌. మ‌రి సోష‌ల్ మీడియాలో వస్తోన్న ఈ వార్త‌ల‌పై ఎన్టీఆర్ అండ్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఈ క్రమంలో ఎప్పటినుంచో జూనియర్… మీడియా రంగంలోకి రావాలని భావిస్తున్నారంట! అయితే అది న్యూస్ ఛానల్ అయితే బాగుంటుందని మొదట్లో భావించినా.. అది భవిష్యత్ అవసరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నా… ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో న్యూస్ ఛానల్ పెడితే సవాలక్ష సమస్యలు వస్తాయని అనుకున్నారట. ప్రస్తుతం మీడియా… ప్రభుత్వ అనుకూలం, ప్రభుత్వ వ్యతిరేకం అనే వర్గాలుగా విడిపోతోన్న ఈ దశలో.. ఒకవేల నిజంగా న్యూస్ ఛానల్ పెడితే… అటు జగన్ కో, ఇటు టీడీపీకో ఎంతోకొంత సపోర్ట్ గా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలున్నాయని… ఈ సమయంలో అంత రిస్క్ అవసరంలేదని ఎన్ టీఆర్ భావించారని తెలుస్తుంది.

అందుకే ప్రస్తుతం తానున్న సినీ రంగానికి అనుకూలంగా ఉండేలా… ఎంటర్ టైన్ మెంట్ వైపే మొగ్గుచూపారని తెలుస్తోంది. ఈ క్రమంలో… ఆయన తన సతీమణై లక్ష్మీ ప్రణతిని మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించబోతున్నారంట! కాగా… గతంలో ప్రణతి తండ్రి.. ఒక న్యూస్ ఛానల్ నడిపారనేది తెలిసిన విషయమే!!

Read more RELATED
Recommended to you

Latest news