కార్తికేయ 3 నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

-

యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2.. ఈ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. కలెక్షన్ల విషయంలో కార్తికేయ 2 సినిమా దుమ్ము లేపింది. రూ. 100 కోట్లు వసూలు నమోదు చేసిన ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా భారీ షేర్ ను దక్కించుకుంటూ దూసుకు వెళ్తోంది. చిన్న సినిమాగా సాదాసీదాగా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే కార్తికేయ 2 టీంకు అదృష్టం ఒక రేంజ్ లో కలిసి వస్తోంది . బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ గా కేక పెట్టిస్తోంది.

టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఎంతో భారీగా నిర్మించిన ఈ సినిమా భారతీయ సనాతన ధర్మం శ్రీకృష్ణుని జీవితానికి సంబంధించిన ఒక కీలక అంశం ఆధారంగా అడ్వెంచరస్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అభిమానుల నుండి సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా కార్తికేయ 3 సినిమాతో ఆడియన్స్ ను పలకరించనున్నట్టు ఇప్పటికే కార్తికేయ 2 క్లైమాక్స్లో హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి 7:30 గంటలకు సోషల్ మీడియాలో #AskNikhil సెషన్ లో పాల్గొన్న నిఖిల్ సిద్ధార్థ చిట్ చాట్ సెషన్ లో భాగంగా ఒక అభిమాని .. అన్న కార్తికేయ 3 ఉంటుందా అని అడిగాడు.

దానికి నిఖిల్ కచ్చితంగా ఉంటుంది ..అయితే ఈసారి త్రీడీలో మరో అద్భుతమైన పాయింట్ ను డైరెక్టర్ చందు మొండేటి వినిపించారు అంటూ క్రేజీ అప్డేట్ అందించాడు. దీంతో కార్తికేయ 3 సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అంటూ అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news