ఏపీ అసెంబ్లీకి తెలుగు దేశం ఎమ్మెల్సీల బహిరంగ లేఖ

-

ఏపీలో నాసిరకం మద్యం.. హానికారకమైన మద్యం సరఫరా చేస్తున్నారంటూ మండలి ఛైర్మనుకు టీడీపీ ఎమ్మెల్సీల లేఖ రాశారు. జంగారెడ్డి గూడెం మరణాలు సహా ఏపీలో సరపరా అవుతోన్న మద్యం నాణ్యతపై జరపాలని టీడీపీ ఎమ్మెల్సీలు ఈ లేఖలో కోరారు. సారాక్షసి, జే బ్రాండ్ల నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉభయ సభల్లో ప్రభుత్వం చర్చకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని.. జే బ్రాండ్లలో ప్రజలు ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని లేఖలో టీడీపీ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.

TDP
TDP

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డి గూడెంలోనే వారం రోజుల్లో 28 మందికి పైగా సారా తాగేవాళ్లు మృతి చెందారని.. ఏలూరు ప్రభుత్వ ఆస్ప‌త్రిలోనూ జే బ్రాండ్ ప్ర‌మాద‌క‌ర మ‌ద్యం తాగిన వారు చికిత్స పొందుతున్నారని మండిపడ్డారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని… మ‌ద్య‌ నిషేధం హామీతో అధికారంలోకొచ్చిన ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం వ్యాపారం ఆరంభించిందన్నారు. ఈ ఏడాది ఏకంగా సుమారు రూ. 24 వేల కోట్లు మ‌ద్యంపై ఆదాయం రాబ‌డుతోందని.. పిచ్చి మ‌ద్యం అత్య‌ధిక ధ‌ర‌ల‌కి అమ్ముతుండ‌డంతో నిరుపేద‌లు సారాకి అల‌వాటు ప‌డి ప్రాణాలు తీసుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news