ఎల్ఐసీ సూపర్ పాలసీ..రోజుకు రూ.238 పెడితే..రూ.54 లక్షలు పొందవచ్చు..

-

ఎల్ఐసీ కొత్త స్కీమ్ లను అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..ఎల్‌ఐసీ వల్ల ఎంతోమంది తమ జీవితాలు బాగుపడ్డాయి.ఎన్నో కుటుంబాలని రోడ్డున పడకుండా ఆదుకుంది. అందుకే ఎల్‌ఐసీ అంటే ఒక నమ్మకం. ఒక భరోసాగా చెబుతారు. ఇందులో భాగంగా ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన జీవన్‌ లాభ్‌ అనే పాలసీ గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు పూర్తి వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం..

ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పథకంలో మెచ్యూరిటీ, డెత్ బెనిఫిట్ రెండూ ఉంటాయి. స్కీం ప్రకారం పాలసీ వ్యవధిలోపు పాలసీదారు మరణిస్తే, మెచ్యూరిటీ మొత్తం నామినీకి అందిస్తారు. పాలసీ నిర్ణీత సమయం ముగిసే వరకు జీవించి ఉండి అన్ని ప్రీమియంలను చెల్లిస్తే అతను/ఆమె ‘మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్’ మొత్తాన్ని పొందుతారు. ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీలో కనీసం రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట మొత్తంపై పరిమితి లేదు..
ఈ పాలసి మెచ్యూర్ సమయం వేర్వేరుగా ఉంది.

ఏ వ్యక్తి అయినా 8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. 16 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 25 సంవత్సరాల మెచ్యూరిటీ కాలానికి పాలసీని తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఉంటుంది. ప్రీమియం నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు..

మీకు 25 సంవత్సరాల వయస్సులో ఈ పాలసి తీసుకుంటే . 20 లక్షలను ప్రాథమిక బీమా మొత్తంగా ఎంచుకోవాలి. GST మినహాయించి సంవత్సరానికి రూ.86954 ప్రీమియం చెల్లించాలి. దీని ధర ప్రతిరోజు దాదాపు రూ. 238 అవుతుంది. మీరు 50 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అంటే 25 సంవత్సరాల తర్వాత మొత్తం మెచ్యూరిటీ రూ. 54.50 లక్షలు అవుతుంది..ఇది అందరికి మంచి అవకాశం..మీకు ఈ ఆలోచన ఉంటే ఇప్పుడే ఈ పాలసిని తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news