జగన్ కి జీవిత ఖైదీ తప్పదంటున్న టిడిపి నేత…. నక్క ఆనంద్ బాబు

-

రేపు యువ గళం ముగింపు సభలో రాబోయే ఎన్నికలకి శంఖారావం పూరించనున్నారని ఒకవేళ జగన్ పై ఉన్న కేసులకు విచారణ జరిపితే జగన్ కి జీవిత ఖైదీ తప్పదని టిడిపి మాజీ మంత్రి నక్క ఆనందబాబు సంచల వ్యాఖ్యలు చేశాడు. సీఎం పదవి జగన్ కి కేవలం కేసుల యొక్క విచారణ ముందుకి జరగకుండా మాత్రమే చేస్తుందని తెలిపాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గతంలో 6 కోట్ల కుంభకోణం చేసి జైలు పాలు అయ్యారని అటువంటిది జగన్ పై ఏకంగా 43 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన 12 చార్జి సీట్ల కేసులు ఉన్నాయని వీటికి జగన్ శాశ్వతంగా జైలులోనే జీవితం గడిపే అవకాశాలు ఉన్నాయని అన్నాడు.

 

ఒక్కసారి జగన్ యొక్క పదవి పోతే రాబోయే రోజుల్లో అతనిపై కేసుల విచారణ ప్రారంభం అవుతుందని చెప్పాడు.జగన్ వై నాట్ 175 అనడం కాదు జగన్ వై నాట్ పులివెందుల అనడం సరైందని అన్నాడు. చంద్రబాబుపై పెట్టిన కేసులని చిత్తు కాగితాలతో సమానమని నక్క ఆనందబాబు అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news