మద్యపానం చేసే వారికి స్థానిక సంస్థల టికెట్లు ఇవ్వం : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

-

మద్యపానం చేసే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు.. పదవులు ఇవ్వబోమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలోని దండెపల్లి లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇకపై మద్యపానం చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు మద్యం సేవించమని, మాదక ద్రవ్యాలు తీసుకోబోమని ప్రమాణం చేసారు. 

గాంధీజీ కన్న కలలు సాకారం చేయడానికే మద్యానికి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టు వారు చెప్పారు. ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘించే వారికి స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు టికెట్లే కాదు.. ఏ పదవులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ప్రతిజ్ఞ చేసిన నేతలంతా తాము కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా జీవనం సాగిస్తామని.. వర్గ విభేదాలు, కులమత తేడాలు, కక్షలు గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news