కాపురాలు కూల్చడం పవిత్ర కు అలవాటే – లోకేష్ పవిత్ర భర్త

-

టాలీవుడ్‌ నటుడు నరేష్‌ మరో వివాహం చేసుకున్నాడు. మైసూర్ లో పవిత్ర-నరేష్ ల జంట వివాహం చేసుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. నెల  కిందటే పవిత్ర- నరేష్ ల పెళ్లి జరిగిందని సమాచారం అందుతోంది. అయితే.. తాజాగా మైసూరులోని ఓ అపార్టుమెంట్‌లో ఉండగా నరేష్-పవిత్ర లోకేష్ జంటను అడ్డుకునేందుకు ప్రయత్నించింది నరేష్ మూడో భార్య రమ్య. అంతేకాదు.. పవిత్ర లోకేష్‌ను చెప్పుతో కొట్టబోయింది రమ్య. అయితే.. రమ్యను అడ్డుకున్నారు పోలీసులు. అటు రమ్యను చూసి విజిల్స్ వేస్తూ వెళ్లిపోయాడు నరేష్.

అయితే నరేష్ మరియు పవిత్ర వివాహంపై… లోకేష్ భర్త సుజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన ఘాటు పదజాలంతో పవిత్ర లోకేష్ తీరుపై విమర్శలు గుప్పించారు. పవిత్ర లోకేష్ కు కాపురాలు కుల్చడం అలవాటేనని… ఆశలు ఎక్కువ అని విమర్శలు చేశారు. అందుకే  తనను వదిలేసి వెళ్ళిపోయింది అంటూ ఆరోపణలు చేశారు. తనను పవిత్ర లోకేష్ మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వీళ్ళ గురించి మొదటి నుంచి విషయం తెలియదని.. మీడియాలో వచ్చిన కథనాలు అబద్ధాలు అనుకున్నానని తెలిపారు. కానీ ఇవాళ వారికి పెళ్లి అవ్వడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news