చినబాబు ఫ్యాన్స్ థాంక్స్: భార్యకు మెసేజ్‌ పెట్టాలన్నా జగన్‌ పర్మిషన్!

-

కరోనా గ్యాప్ లో ఏమిజరిగిందో తెలియదు కానీ… గతకొన్ని రోజులుగా కాస్త దూకుడు పెంచారు నారా లోకేష్. గతంలో తనకున్న ముద్దుపేరును చెరిపేసుకునే పనిలో భాగమో, తండ్రి పెద్దాయన ఐపోయారు కాబట్టి బాధ్యత పెరిగిందన్న నమ్మకమో, అదీగాక రామ్మోహన్ నాయుడు రూపంలో పోటీ వస్తుందన్న భయమో తెలియదు కానీ… లోకేష్ అయితే దూకుడు పెంచాడు. గతకొన్ని రోజులుగా అవే విమర్శలు అయినా… కాస్త బలంగా, మాస్ అట్రాక్షన్ కి తగ్గట్లుగా వదులుతున్నారు. తాజాగా నిమ్మాడలో మైకుల ముందుకొచ్చిన లోకేష్.. స్వరం పెంచారు.

nara lokesh hot comments on ys jagan mohan reddy after meeting with atchennaidu family

అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించడానికని నిమ్మాడకు బయలుదేరారు నారా లోకేష్. వెళ్లేదారిలో ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అచ్చెన్న ఇంటికి చేరుకున్నారు. అచ్చెన్నా భార్య, పిల్లలను పరామర్శించిన అనంతరం మైకులముందుకు వచ్చారు లోకేష్. ఈ సమయంలో లోకేష్ చేసిన రెగ్యులర్ రాజకీయ విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే.. కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ కొన్ని మాస్ డైలాగులు పేల్చారు.

ఆంధ్రప్రదేశ్‌ మరో బిహార్‌గా మారిపోయిందని.. తమిళనాడు తరహాలో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని.. వడ్డీతో సహా చెల్లిస్తామని మొదలుపెట్టిన లోకేష్… ఫేస్‌బుక్‌ లో పోస్టు పెట్టాలంటే సీఎం జగన్‌ పర్మిషన్‌ తీసుకోవాలా?.. ఇకపై భార్యకు మెసేజ్‌ పెట్టాలన్నా జగన్‌ పర్మిషన్‌ తీసుకోవాలేమో అని అన్నారు. దీంతో స్థానికంగా ఉన్న కార్యకర్తలు హడావిడి చేశారు. లోకేష్ మాస్ లీడర్ గా మారడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారని అంటున్నారట. ఏది ఏమైనా… గతకొన్ని రోజులుగా లోకేష్ మాత్రం కాస్త వాయిస్ పెంచినట్లే. దానికి కారణం పరిస్థితులు అయితే పరిస్థితులకు, బాబు అయితే బాబుకు, రామ్మోహన్ నాయుడు అయితే ఆయనకి కృతజ్ఞతలు అంటున్నారట చినబాబు ఫ్యాన్స్!

Read more RELATED
Recommended to you

Latest news