తాడేప‌ల్లి కొంపలో ఏమైనా పోశారా..? డీజీపీ మీద లోకేష్‌ సంచలనం

-

ఏపీ డీజీపీ మీద నారా లోకేష్ సెటైర్ లు వేశారు. ఈరోజు దేవాలయాలకు సంబంధించి ఆయన ఒక లిస్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం టీడీపీ, బీజేపీ నేతలకు దేవాలయాల మీద దాడుల విషయంలో హస్తం ఉందని అన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా లోకేష్ డీజీపీని ఎద్దేవా చేశారు. విగ్ర‌హాలు ధ్వంసం చేసింది దొంగ‌లు, పిచ్చోళ్ల‌ని నిన్న చెప్పిన డిజిపి దొరా, నేడు రాజ‌కీయ కుట్ర కోణంవైపు మీ మాటెందుకు తిరిగింది! రాత్రికి తాడేప‌ల్లి కొంపలో జగన్ మార్క్ భోగి ప‌ళ్లేమైనా మీకు పోశారా? అని ప్రశ్నించారు. మీరు విడుద‌ల‌ చేసిన జాబితాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన‌ వైసీపీ నేత దామోదర్ రెడ్డి పేరు లేదేం? అని లోకేష్ ప్రశ్నించారు.

ఓంకార క్షేత్రంలో అర్చ‌కుల‌ను చిత‌క్కొట్టిన  వైసీపీ నేత ప్రతాపరెడ్డి పేరు ప్ర‌స్తావించ‌లేదెందుకు? ఆంజ‌నేయుడు చేయి విరిగితే ర‌క్త‌మొస్తుందా? రాముడి తల తెగితే విగ్ర‌హం ప్రాణం పోతుందా? అని హిందుత్వంపైనే దాడికి దిగిన బూతుల‌ మంత్రి నానిపై కేసు ఎందుకు పెట్ట‌లేదు? అని ఆయన ప్రశ్నించారు. హిందుత్వం మ‌నుగ‌డ‌నే ప్ర‌శ్నించేలా దాడులు జ‌రుగుతుంటే నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం చేత‌కాక చేవ‌చ‌చ్చిన మీపై ముందు కేసు పెట్టాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. త‌ప్పుడు స‌మాచారంతో రాష్ట్ర ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నందుకు కోర్టులు మీపై సుమోటోగా కేసు న‌మోదు చేయాలని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news