ఐపిఎల్ 2023: పూర్తిగా తేలిపోయిన లక్నో… రాజస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం!

-

జైపూర్ లో రాజస్థాన్ మరియు లక్నో జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… లక్నో బ్యాటింగ్ లో నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. రాహుల్ సేన ఇన్నింగ్స్ ను చాలా నెమ్మదిగా స్టార్ట్ చేసింది. అయితే ఆ తర్వాత ఊపందుకున్న ఇద్దరూ మొదటి వికెట్ కు 82 పరుగులు చేసారు. రాహుల్ 39 పరుగులకే అవుట్ కాగా , మేయర్స్ మాత్రం అర్ద సెంచరీ పూర్త అయిన తర్వాత అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

 

ఆ తర్వాత పడుతూ లేస్తూ చివరికి ఆ మాత్రం స్కోర్ చేసింది. అయితే లక్నో కు ఉన్న బ్యాటింగ్ సోర్స్ కు రాజస్థాన్ మీద ఇంత తక్కువ స్కోర్ చేసి గెలవడం చాలా కష్టం. కానీ లక్నోకు బౌలింగ్ కూడా బాగుంది. మరి ఎవరు ఈ మ్యాచ్ లో గెలుస్తారు అన్నది తెలియాలంటే కొంత సేపు వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news