మదనపల్లె తరహా ఘటన.. శక్తుల కోసం మరో మహిళను పెళ్ళాడి, పిల్లలను చంపబోయిన తల్లి !

-

తమిళనాడులో మదనపల్లి తరహాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అతీత శక్తులు వస్తాయని భావించి మరో మహిళను ఒక మహిళ పెళ్లాడింది. రెండో భార్య స్నేహితురాలితో మొదటి భార్యకు రామలింగం అనే వ్యక్తి వివాహం చేశారు. ఇంట్లోనే కుమారుల ముందు రామలింగం ఈ పెళ్లి జరిపినట్లు సమాచారం. మూఢనమ్మకాలతో ఇద్దరు పిల్లలను నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే నరబలి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న పిల్లలు ఎట్టకేలకు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. అయితే గత కొద్ది రోజులుగా పిల్లలను స్కూల్ కి కూడా పంపకుండా సదరు తల్లి చిత్రహింసలు పెడుతున్నట్లు చెబుతున్నారు.

వారికి శానిటైజర్  తాగించి ఒంటికి కారం బూసి చిత్రహింసలు పెట్టినట్లు పిల్లలిద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మాటలు నమ్మి అతీత శక్తులు వస్తాయని భావించి పిల్లలను బలిచ్చేందుకు తల్లి కూడా సిద్ధం ఆందోళన కలిగిస్తోంది. విషయం అర్ధం అయిన పిల్లలు ఇంటి నుంచి పారిపోయి బంధువులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగ పాల్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. వెంటనే తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news