మాదాపూర్ లో బాలుడి మిస్సింగ్ కేస్ సుఖాంతం.. మీడియా దెబ్బకి వదిలేసి పరార్ !

-

మాదాపూర్ లో బాలుడి అదృశ్యం అయిన ఘటన సుఖాంతం అయింది. మాదాపూర్ చంద్ర నాయక్ తండాలో నిన్న మధ్యాహ్నం నుంచి ఐదేళ్ళ బాలుడు కనిపించడం లేదు. ఈ విషయం చెప్పడానికి పోలీసుల దగ్గరకి వెళితే భవనం సెల్లార్ గుంతలో పడి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తంచేసారు పోలీసులు. అంతే కాదు డి ఆర్ ఎఫ్ బృందాలని రప్పించి మరీ గాలించారు. ఆ గుంతలో ఉన్న నీటిని అంతటినీ జిహెచ్ఎంసి అధికారులు కూడా వచ్చి తోడేశారు.

అయితే ఎవరో కిడ్నాప్ చేశారని బాలుని తల్లిదండ్రులు ఆరోపణలే నిజమయ్యాయి. మేడిపల్లి పోలీసుల అదుపులో గుర్తు తెలియని బాలుడు ఉన్నాడని సమాచారం అందడంతో మాదాపూర్ పోలీసులు క్రాస్ చెక్ చేయగా ఆ బాలుడు నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ కిడ్నాప్ గురైన బాలుడని తేలింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, నిన్న మధ్యాహ్నం నుండే మీడియాలో వరుస కధనాలు ప్రసారం కావడంతో అలర్టైన కిడ్నాపర్స్ మేడిపల్లిలో బాలుడ్ని వదిలి పరారైనట్టు తెలుస్తోంది. బాలుడిని ముందుగ హై వే పాట్రోల్ పోలీసులు గుర్తించి మేడిపల్లి పోలీసులకి అప్పగించారు. కిషన్ అనే వ్యక్తే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు మాదాపూర్ పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news