దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్ధి ఆయనే… ఖరారు చేసిన కాంగ్రెస్

-

కాంగ్రెస్ దుబ్బాక అభ్యర్థి పై ఇంకా ఉత్కంట కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న టిఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో కాంగ్రెస్ కీలక నేతలు చర్చలు జరుపుతున్నారు. బలమైన నేత కావడంతో ఆయనను కాంగ్రెస్ కాస్త సీరియస్ గానే తీసుకుంది. నియోజకవర్గంలో ఆయనకు చాలా మంచి బలం ఉంది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి దుబ్బాక టికెట్ ఆఫర్ చేస్తోన్న కాంగ్రెస్… ఎలా అయినా సరే పార్టీలోకి తీసుకు రావాలని భావిస్తుంది.

టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్న శ్రీనివాస్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మనిక్కం ఠాకూర్ భేటీ కానున్నారు. అనుచరులు, అభిమానులతో సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిక పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని ప్రకటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news