బోల్డ్ పాత్రలకు సై అంటున్న అల్లరి నరేష్ హీరోయిన్..!

-

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోయిన్లు సైతం ఎన్నో సాహసాలు చేస్తున్న విషయం తెలిసిందే. బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇటీవలే మరో హీరోయిన్ కూడా తాను బోల్డ్ పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అని చెబుతోంది. కితకితలు సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మధుశాలిని. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో సరైన అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ వరుసగా వెబ్ సిరీస్ లను చేసుకుంటూ మాత్రం దూసుకుపోతోంది.

అయితే తనకుకథ పాత్ర నచ్చితే బోల్డ్ పాత్రల్లో నటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతోంది మధు షాలిని . పాత్ర డిమాండ్ చేస్తే బోల్డ్ పాత్రల కైనా రెడీ అంటుంది. ప్రస్తుతం తాను గూడచారి 2 సినిమాలో నటిస్తున్నట్లు తెలిపిన ఈ ముద్దుగుమ్మ… పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం మధుశాలిని నటిస్తున్న ఎక్స్పైరీ డేట్ అనే వెబ్ సిరీస్ ఇటీవలే మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news