పొంగులేటి గెలవడం ఒక్క ఆక్సిడెంట్ మాత్రమే..గెలిచే ఛాన్స్ లేదు – తాత మధు

-

పొంగులేటి గెలవడం ఒక్క ఆక్సిడెంట్ మాత్రమే..గెలిచే ఛాన్స్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్‌ఎస్‌ నాయకులు తాత మధు. కేసీఆర్ రైతు పక్ష పాతి అని.. నిన్నటి వరకు మాట్లాడిన పొంగులేటి… ఇప్పుడు 24 గంటల కరెంట్ లేదని ఎలా చెబుతున్నాడని కౌంటర్‌ ఇచ్చారు. నీ మామిడి తోటకు 24 కరెంట్ వస్తుందా రావడం లేదా… నీ స్వంత గ్రామం నారాయణ పురం వెళ్దామా… బహిరంగ చర్చ కు సిద్దమా..అని తాతమధు సవాల్‌ చేశారు.

మాజీ పార్లమెంట్ సభ్యుడైన నీకు కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. నిబంధనలు ఏ పార్టీకైనా ఉంటాయి..పార్టీ నిబంధనలు పద్దతులు పాటించాలన్నారు. ఇతర పార్టీలో నుంచి వచ్చిన నాయకులకు అనేక అవకాశాలు కేసీఆర్ కల్పించారని..స్వంత బిడ్డల మాదిరిగా చూశారన్నారు. కొంతమంది మా వల్లనే జిల్లాలో పార్టీ అభివృద్ధి అయ్యిందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. తమ స్థాయిని ఎక్కువగా ఊహించుకుని మాట్లాడు తున్నారు.. ఆత్మీయ సమ్మేళనం పేరుతో పార్టీకి వ్యతరేకంగా పొంగులేటి మాట్లాడుతున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news