బంపర్ ఆఫర్ అందుకున్న మడోన్నా సెబాస్టియన్..!

-

మడోన్నా సెబాస్టియన్.. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. మలయాళమ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి తమిళ్, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో అవకాశాలను అందుకుంది. నిజానికి తెలుగు ప్రేక్షకులకు ఈమె పెద్దగా పరిచయం లేదు. కానీ కొన్ని సినిమాలు మాత్రమే చేసిందని చెప్పవచ్చు. అయితే హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా మారిన ఈమె ఆ తర్వాత తమిళంలో కూడా ఒక సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత తన నటనతో, అందంతో మెప్పించిన మడోన్నా.. ఎక్కువగా తమిళ్ , మలయాళం సినిమాలలో నటిస్తూ వచ్చింది. అంతేకాదు తెలుగు ప్రేమమ్ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషించింది.

ఇటీవల నాని, సాయి పల్లవి , కృతి శెట్టి సంయుక్తంగా నటించిన శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో కూడా లాయర్ పద్మావతి పాత్రలో అంటే కృతి శెట్టి అక్క పాత్రలో నటించింది. అయితే మొన్నటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి నక్కతోక తొక్కినట్లు తెలుస్తోంది. డీజే టిల్లు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ దానికి సీక్వెల్ గా డీజే టిల్లు 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.. అయితే మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించగా..అదే సినిమాలో ఆమెకు ఎండింగ్ పడినట్లు చూపించారు. అందుకే రెండవ భాగంలో యంగ్ హీరోయిన్ శ్రీ లీలా ను తీసుకున్నారు.

అయితే కొన్ని కారణాల చేత ఆమె తప్పుకుంది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోగా ఆమె కూడా తప్పకుండాట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోని అనుపమ పరమేశ్వరన్ స్థానంలో మడోన్నా సెబాస్టియన్ ఎంపికైనట్లు సమాచారం. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో భారీ పాపులారిటీని తెచ్చుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా డీజే టిల్లులో హీరోయిన్ గా బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ మలయాళ బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Latest news