మధ్యప్రదేశ్ బస్సు ప్రమాద: మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు ఎక్స్ గ్రేషియా !

-

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్గోన్ జిల్లాలో బస్ బ్రిడ్జి పై నుండి వెళుతూ కాలువలో పడి ప్రమాదం జరగడం వలన ప్రయాణిస్తున్న వారిలో మొత్తం 15 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారిక సమాచారం. ఇక ఈ ప్రమాదానికి డ్రైవర్ ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో మధ్యప్రదేశ్ రాష్ట్రము అంతటా విషాదచాయాలు అలుముకున్నాయి. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి వారి కుటుంబాలకు రూ. 4 లక్షలు పరిహారం అందించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఈ ప్రమాదంలో గాయాల పాలైన 25 మందికి కూడా రెండు రకాలుగా పరిహారం అందించనుంది.

ఎక్కువగా గాయాలు అయిన వారికి రూ. 50 వేలు మరియు స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేలుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news