ఛీ..ఛీ..ఇదేం పాడుబుద్ది..వాటిని కూడా వదలరా నాయనా..

-

ఈ మధ్య దొంగలు వింత దొంగతనాలను చేస్తున్నారు.. అసలు ఎందుకు చేస్తున్నారు? వాటి వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? అనే విషయాలు పోలీసులతో పాటు జనాలకు కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారింది..ఆ దొంగలను పట్టుకోవడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది..ఇప్పుడు ఇలాంటి వింత దొంగతనం జరిగింది..ఆ దొంగతనం ఎంటో ఒకసారి చూడండి..

అర్ధరాత్రి చోరీలకు వెళుతున్న ఆ ఘనుడు ఇంటి పైకప్పుపై ఆరేసిన మహిళల లోదుస్తులు, ఇన్నర్లను దొంగలిస్తున్నాడు. అయితే వీటిపై ఫిర్యాదు చేస్తే బాగుండడని మహిళలు కూడా ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఆ యువకుడు ఇంకా రెచ్చిపోయాడు. చివరకు ఓ వ్యాపారి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఈ వింత దొంగ గుట్టు బయటకు వచ్చింది..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ బాలుడు మహిళల లోదుస్తులను దొంగతనం చేస్తున్నాడు. ఆకాష్ వర్మ అనే యువకుడు గ్వాలియర్‌లో మహిళల లోదుస్తులు, ఇన్నర్‌లను దొంగతనం చేస్తున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకాష్ పైకప్పు లేదా గేట్ ద్వారా ఇళ్లలోకి ప్రవేశించి ఉతికేసిన మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నాడు. ఇలా గ్వాలియర్‌ ప్రాంతంలో చాలా ఇళ్లలో దొంగతనాలు చేశాడు.
ఆరేసిన లోదుస్తులు, ఇన్నర్‌ లు ఏమవుతున్నాయో తెలియక మహిళలు అందరూ అయమయానికి గురయ్యారు..

ఎప్పటిలాగా గత రాత్రి కూడా దొంగతనానికి వెళ్ళాడు..చాలా సమయం తర్వాత చేతిలో మహిళల లోదుస్తులు పట్టుకుని బయటికి వచ్చాడు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో అర్ధరాత్రి ఓ దొంగ తన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య లోదుస్తులను దొంగిలించాడని ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాపారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడు ఆకాశ్‌ను గుర్తించారు..అతన్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news