నిజమైన హిందుత్వవాది అయితే జిన్నాను కాల్చేవాడు… గాంధీని కాదు- సంజయ్ రౌత్

-

ఎప్పుడు వివాదాస్పద, సంచలన వ్యాఖ్యల్లో ముందుందే శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. తాజాగా గాంధీజీ వర్థంతి సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సేని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ అలీ జిన్నా.. పాకిస్తాన్ కోసం పట్టుబట్టారని, నిజమైన హిందుత్వవాది అయితే జిన్నాను కాల్చి చంపేసే వాడని,  మహాత్మ గాంధీని కాదంటూ.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది నిజమైన దేశభక్తి కాదని విమర్శించారు. గాంధీజి మరణంపై యావత్ ప్రపంచం ఇప్పటికీ  సంతాపం వ్యక్తం చేస్తుందని సంజయ్ రౌత్ అన్నారు.

సంజయ్ రౌత్ ప్రస్తుతం శివసేనలో కీలక నేతగా ఉన్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా, మహావికాస్ అఘాడీగా జతకట్టడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల కాలంలో బీజేపీపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన వదిలేయడం వల్లే.. బీజేపీకి ప్రధానమంత్రి పదవి దక్కిందంటూ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news