మహత్మాగాంధీ ముని మనుమరాలికి 7 ఏళ్ల జైలు

-

 

న్యూఢిల్లీ: భారత జాతిపిత మహత్మాగాంధీ మునుమనమరాలికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో ఆశిష్ లతా రామ్‌గోబిన్‌కు సౌతిఫ్రికాలోని దర్బాన్ కోర్టు ఈ శిక్ష విధించింది. ఫోర్జరీ పత్రాల కేసులో 56 ఏళ్ల ఆశిష్ లతా రామ్‌గోబిన్‌‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది.

వ్యాపారదేవీల్లో భాగంగా సౌతాఫ్రికా వ్యాపార వేత్త ఎస్. మహారాజు‌ నుంచి ఆమె ఆడ్వాన్సుగా రూ.3.3 కోట్లు తీసుకున్నారు. అయితే ఈ డబ్బులకు సుంకం చెల్లించలేదని, వ్యాపారంలో తన వాటాను కూడా చెల్లించలేదని ఆమెపై వ్యాపారవేత్త మహారాజు‌ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో అశిష్ లతా రామ్ గోబిన్ తప్పు చేసినట్లు తేలింది. దీంతో ఆమెకు దర్బాన్ క్రైమ్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. కాగా ఎలా గాంధీ, దివంత మేవా రామ్ గోబిన్ కుమార్తె ఆశిష్ లతా రామ్ గోబిన్.

Read more RELATED
Recommended to you

Latest news