మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసిఆర్!

-

మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో అభ్యర్థిని ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. కాగా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తరపున మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే

ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీ చేసే వాళ్లను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్ ,ఖమ్మం పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన మాలోతు కవితకు మళ్లీ అవకాశం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news