టి20 ప్రపంచ కప్ పై మహేశ్ బాబు ట్వీట్

-

టి20 ప్రపంచ కప్ 2021 విశ్వవిజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్ ఫైనల్ లో భాగంగా నిన్న న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తర ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఈ కింద నాలుగు వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ 85 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అయితే 173 పరుగుల చేంజింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు… కేవలం రెండు వికెట్లు కోల్పోయి… 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా… విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయానికొస్తే… డేవిడ్ వార్నర్ 53 పరుగులు అలాగే మిచెల్ మార్స్ 77 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

అయితే ఈ మ్యాచ్ పై టాలీవుడ్ హీరో మహేష్ బాబు ట్వీట్ చేశారు. ” ఆస్ట్రేలియా జట్టు చాలా బలమైనది. నిన్నటి మ్యాచ్ లో చాలా బాగా రాణించారు. విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు. డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు ఒక లెజెండ్ ఆటగాడు. ” అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు మహేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news