కొడాలి, వల్లభనేని, అంబటిని చంపితే 50 లక్షలు ఇస్తా..!

-

మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అలాగే ఎమ్మెల్యే అంబటి రాంబాబు ను టార్గెట్ చేస్తూ మల్లాది వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు నేతలను భౌతికంగా దూరం చేస్తే 50 లక్షల రూపాయల బహుమతి ఇస్తానని వాసు ప్రకటించారు. కమ్మ వనసమారాధన లో… జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు ఈ వ్యాఖ్యలు చేశారు.

మధిర మున్సిపల్ కౌన్సిలర్ గా మల్లాది వాసు… విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కమ్మ వారికి… పరిటాల రవి అండగా ఉండేవాడని తెలిపారు మల్లాది వాసు. కానీ పరిటాల రవి… చనిపోయిన తర్వాత ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి అని తెలిపారు. పరిటాల రవి బతికి ఉంటే ఆంధ్రాలో ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని వెల్లడించారు మల్లాది వాసు.

కమ్మ కులం లో కొడాలి నాని, వల్లభనేని వంశీ చెడగొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లాది వాసు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మల్లాది వాసు వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. వారి ఉడత బెదిరింపులకు…. తాము భయపడబోమని స్పష్టం చేశారు వల్లభనేని వంశీ.

Read more RELATED
Recommended to you

Latest news