మాల్యాకు సుప్రీంలో చుక్కెదురు.. చెత్త కుప్పలో రివ్యూ పిటిషన్

-

2017లో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఇచ్చిన తీర్పుపై విజయ్ మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘించి వారసులకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేయడాన్ని కోర్టు ధిక్కరణ కిందే తేల్చింది.ఇరువైపులా వాదనలు విన్న అనంతరం.. తీర్పును సమీక్షించేందుకు తమకు ఎలాంటి అవసరం కనపడటం లేదని జస్టిస్​ యూయూ లలిత్​, జస్టిస్​ అశోక్​ భూషణ్​ ధర్మాసనం పేర్కొంది.కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ.. తన వారసులకు 40మిలియన్​ డాలర్లను బదిలీ చేసినట్టు 2017లో సుప్రీంకోర్టుకు వెళ్లాయి ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకులు.

రూ.9వేల రుణాల ఎగవేత కేసులో నిందితుడు మాల్యా.. ప్రస్తుతం లండన్​లో ఉంటున్నారు.జప్తు చేసిన ఆస్తులు వేలం వేయడానికి బ్యాంకుల కన్సార్టియంకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇదివరకే ప్రత్యేక కోర్టుకు తెలిపింది ఈడీ. 2013 నుంచి చెల్లించాల్సిన మొత్తానికి వడ్డీతో కలిపి రూ. 6,203.35 కోట్లకు ఆస్తుల వేలం నిర్వహించాలని బ్యాంకుల కన్సార్టియం భావిస్తోంది.పలాయనంలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగిస్తారని వార్తలు వచ్చినా.. అది ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. బ్రిటన్​ ప్రభుత్వం తాజాగా మరో మెలిక పెట్టింది. చట్టంలో ఉన్న నిబంధనల దృష్ట్యా వాటిని పరిష్కరించాకే.. పంపిస్తామని బ్రిటన్ హై కమిషన్ స్పష్టం చేసింది. అయితే, ఆ చట్ట సమస్య ఏంటన్నది చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. అది రహస్యమని చెబుతున్న బ్రిటన్ హై కమిషన్.. యూకే లా ప్రకారం ఆ సమస్య పరిష్కరించాకే మాల్యాను దేశం దాటిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో మాల్యాను ఇప్పట్లో భారత్‌కు రప్పించడం సాధ్యమేనా… అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news