ఆర్సిబి కప్పు కొట్టడంతో ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టును ఓడించి ఆర్సిబి విజయం సాధించింది. దీంతో ఆర్సిబి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్సిబి జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా కూడా ఎమోషనల్ అవుతున్నారు. టీవీలో మ్యాచ్ చూస్తూ సిద్ధార్థ్ మాల్యా చిన్నపిల్లాడిలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఆర్సిబి కప్ కొట్టగానే ఆఖరికి ట్రోఫీ సాధించాం అంటూ సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మరోవైపు విజయ్ మాల్యా కూడా టైటిల్ గెలిచి నా కల నెరవేర్చిన ఆర్సిబికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. వీరు మాత్రమే కాకుండా చాలామంది సామాన్య మానవులు, సినీ సెలబ్రిటీలు సైతం ఆర్సిబి కప్పు కొట్టడంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ గా ఆర్సిబి ట్రోఫీ సాధించిందని ఆర్సిబి జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఆర్సిబి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.