కరోనాని జయించాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు..!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. మన భారత దేశంలో దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. దీని బారిన పడి రోజుకి వందల మంది మరణిస్తున్నారు. అయితే కరోనాని జయించిన ఓ వ్యక్తి, ఆసుపత్రి ఐసోలేషన్ గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన కేరళలో చోటుచేసుకుంది.

కేరళ రాష్ట్రానికి చెందిన 33 ఏళ్ల వయసు గల ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో అతన్ని తిరువనంతపురం వైద్యకళాశాల ఆసుపత్రిలో చెరిపించారు. అయితే ఆస్పత్రి నుంచి అతను రెండు సార్లు పారిపోయాడు. అనంతరం సొంత ఊరికి వెళ్లిన అతడ్ని గ్రామస్థులు పోలీసులకు పట్టించారు. దీంతో అతన్ని మళ్లీ ఆస్పత్రికి తరలించారు. మళ్లీ కరోనా పరీక్ష చేయడంతో నెగిటివ్ వచ్చింది. వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేద్దామనిసరేకి ఆ వ్యక్తి ఐసోలేషన్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తిరిగి అధికారులకు అప్పగించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news