బలవంతంగా భార్య బీఫ్ తినిపించిందని భర్త ఆత్మహత్య

-

బలవంతంగా బీఫ్ తినిపించారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌ ఉఢానాలో చోటుచేసుకుంది. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా వ్యక్తి ఆత్మహత్యకు భార్య, బావమరిదే కారణమని తేలింది.

అసలేం జరిగిందంటే.. రోహిత్ సింగ్ అనే వ్యక్తి సూరత్​లోని టెక్స్​టైల్ మిల్లులో రంగులు అద్దకం పని చేసేవాడు. అక్కడే అతడికి సోనమ్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం కూడా చేసుకున్నారు. రోహిత్ కుటుంబ సభ్యులు వీరి పెళ్లిని అంగీకరించకపోవడం వల్ల వీరు వేరే చోట కాపురం పెట్టారు.

ఈ క్రమంలో జూన్ 27న రోహిత్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య సోనమ్, బావమరిది అక్తర్ అలీ తనను హింసిస్తున్నారని, బలవంతంగా బీఫ్ తినిపించారని ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్‌ను పోస్టు చేశాడు. ఈ సూసైడ్​ నోట్​ను రోహిత్ స్నేహితుడు చూడడం వల్ల దారుణం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news