సెప్టెంబర్‌ 3న తెరాస శాసనసభాపక్ష సమావేశం

-

సెప్టెంబర్ 3వ తేదీన సాయంత్రం తెరాస శాశనసభాపక్ష సమావేశం జరగనుంది. అదే రోజున ఉదయం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ భేటీకి ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్లు, గిరిజనుల పోడు భూములు, ప్రస్తుత రాజకీయ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

సెప్టెంబర్ 3న జరిగే మంత్రివర్గ భేటీలో శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. కేబినెట్ సమావేశాలు నిర్వహించే తేదీలు ఖరారు చేయనున్నారు. వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్​ ఓ నిర్ణయానికి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news