విజయవాడ : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం లో అపశృతి..!

-

విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం లో అపశృతి చోటు చేసుకుంది. అంతరాలయం మండపంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇంద్రకీలాద్రి అమ్మవారి అంతరాలయంలో పూలు కడుతూ పైనుంచి కింద పడి ఒక యువకుడు మృతి చెందాడు.

షామియానా సిబ్బందిలో 36 సంవత్సరాలు గల యువకుడు పూలు కట్టడానికి పైకి ఎక్కి సిపాయి బల్ల కదిలి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర పై నుండి నుండి కింద పడి మృతి చెందాడు. కింద పడే సమయంలో క్యూ లైన్ లో ఉన్న ఐరన్ రోడ్లపైన పడడంతో తలపై బలమైన గాయం తగిలింది. దాంతో ఆలయ సిబ్బంది ఆ యువకుడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇక ఆలయం లో ఉత్సవాల సమయం లో యువకుడు మృతి చెందటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news