దారుణం : కొడుకు దాడి, తల్లి మృతి, అపస్మారకస్థితిలో తండ్రి !

-

ఈ మధ్య కాలంలో డబ్బు కోసం దేనికి అయినా తెగిస్తున్నారు కొందరు. ఆ డబ్బు కోసం చావడానికి అయినా చంపడానికి కూడా వెనకాడడం లేదు. రోజు రోజుకీ ఆ డబ్బు కోసం లేదా ఆస్తుల కోసం తల్లి తండ్రుల మీద దాడి చేస్తున్న వారి లిస్టు పెరుగుతూ పోతోంది. తాజాగా కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురమొండిలో దారుణం జరిగింది.

తమ్ము వీరరాఘవయ్య అనే యువకుడు… తల్లితండ్రులపై కట్టెలతో దాడి చేశాడు. ఈ దాడి ఘటనలో తల్లి వీరలంకమ్మ స్పాట్‌లోనే చనిపోగా.. తండ్రి నాగేశ్వరరావు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ విభేదాల కారణంగా ఈ దారుణం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇరుగుపొరుగు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండడంతో.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news