మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలి.. షర్మిలకు అవినాష్ కౌంటర్..

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో జనంలోకి దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం రాజకీయ వేడెక్కింది. ఈసారి రాష్ట్ర రాజకీయం అంతా ఒక ఎత్తైతే, కడప జిల్లా రాజకీయం మరో ఎత్తు అన్నట్లు ఉంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసు కడపలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఒక ఊపు ఊపేస్తుంది.

 

 

జిల్లాలో ప్రచారం చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల వైసీపీ అవినాష్ ను హంతకుడు అంటూ సంచలన ఆరోపణ చేసింది.ఇక వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు.విజ్ఞత కలిగిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అన్నారు. ఎన్ని మాటలు అంటారో అనండి ఎంత ప్రచారం చేస్తారో చేయండని,వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని, మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలని మండిపడ్డారు .బురద చల్లి, మసి పూసి తుడుచుకోమంటారని, తడుచుకుంటూ పొతే, బురద చల్లుతూనే ఉంటారని అవినాష్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news