దారుణం.. మ‌గ శిశువా, ఆడ శిశువా అని తెలుసుకునేందుకు భార్య గ‌ర్భం చీల్చాడు..

-

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి గ‌ర్భంతో ఉన్న త‌న భార్య మగ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుందో, లేదా ఆడ‌పిల్ల‌ను ప్ర‌స‌విస్తుందో తెలుసుకునేందుకు ఆమె గ‌ర్భాన్ని ప‌దునైన క‌త్తితో చీల్చాడు. దీంతో ఆమె తీవ్ర గాయాల‌కు గురైంది. ఆమెను స్థానికులు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

man slit his wifes womb to know if fetus is male or female

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీ ప్రాంతంలో సివిల్ లైన్స్ సోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని నెక్‌పూర్ అనే ఏరియాలో పైన తెలిపిన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌న్నాలాల్ అనే ఓ వ్య‌క్తికి ఇప్ప‌టికే 5 మంది కుమార్తెలు జ‌న్మించారు. కానీ అత‌నికి కుమారుడు పుట్టాల‌ని ఆశ ఉంది. దీంతో అత‌ని భార్య మ‌ళ్లీ గ‌ర్భం ధరించింది. ప్ర‌స్తుతం ఆమె 6 లేదా 7 నెల‌ల గ‌ర్భ‌వ‌తి అని పోలీసులు తెలిపారు. కాగా ఆమె గ‌ర్భంలో ఉన్న‌ది మ‌గ శిశువా, లేదా ఆడ శిశువా.. అన్న విష‌యం తెలుసుకునేందుకు అత‌ను ఆమె గ‌ర్భాన్ని క‌త్తితో చీల్చాడు. ఈ సంఘ‌ట‌న‌లో ఆ మ‌హిళ‌కు తీవ్ర‌గాయాలు కాగా.. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం బరేలీలోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ మేర‌కు పోలీసులు ప‌న్నాలాల్‌ను అరెస్టు చేసి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కాగా ఆ మ‌హిళ‌కు 35 ఏళ్ల వ‌య‌స్సు ఉంటుంద‌ని, ఆమె ఈసారి ఎవ‌రికి జ‌న్మ ఇస్తుందో తెలుసుకునేందుకే ఆమె భ‌ర్త ప‌న్నాలాల్ ఇంత‌టి దారుణానికి ఒడిగ‌ట్టాడ‌ని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news