జగన్ అబ్దుల్ కలాం కంటే గొప్పవాడా..?

-

ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. టీటీడీ దేవాలయానికి సంబంధించిన సొమ్మును ఏపీ ప్రభుత్వం వృధా చేస్తోంది అంటూ ప్రతిపక్ష టిడిపి పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉంది. ఇటీవల దీనిపై స్పందించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి… శ్రీవారి పై ఉన్న నమ్మకంతో అబ్దుల్ కలాం లాంటి వారే డిక్లరేషన్ చేశారని… ఏపీ సీఎం జగన్ ఏమైనా అబ్దుల్ కలాం కంటే గొప్పవాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిక్లరేషన్ పై టిడిపి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి… వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదు అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి.

Jagan

ఒకవేళ టిటిడి కి సంబంధించిన సొమ్మును ప్రభుత్వానికి అప్పజెప్పే పరిస్థితి వస్తే టీటీడీ చైర్మన్ ఉన్న వై వి సుబ్బారెడ్డి సహా మిగతా సభ్యులందరూ వెంటనే రాజీనామా చేసి పోవాలి అంటూ ఆయన విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతుండడం ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనం అంటూ విమర్శించారు. టీడీపీ ని గట్టిగా దెబ్బ కొట్టి ఇతర పార్టీలు ఎదగడానికి ప్రస్తుతం ప్రభుత్వం ఈ తరహా రహస్య ఎజెండాతో ముందుకు సాగుతోంది అంటూ ఆరోపించారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news