దారుణం.. 16సార్లు కత్తితో పొడిచి లవర్​ను హత్య చేసిన ప్రియుడు

-

బెంగుళూరులో దారణం చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన ఓ యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. తనను దూరం పెట్టి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో 16సార్లు అతికిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లీలా పవిత్ర స్వస్థలం కాకినాడ. ఉద్యోగం నిమిత్తం బెంగళూరు వెళ్లి దొమ్లూర్‌లోని ఓ ప్రైవేటు లాబోరేటరీలో పనిచేస్తోంది. అదే లాబోరేటరీలో ఉద్యోగం చేస్తోన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్‌ అనే వ్యక్తితో ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. వీరి గురించి తెలిసిన లీలా ఇంట్లో వారు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గత రెండు నెలల నుంచి లీలా.. దివాకర్‌ను దూరం పెడుతూ వస్తోంది. ఇటీవల ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న ప్రియుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు.

మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బయటకు వచ్చిన లీలాపై ఆఫీసు బయటే కత్తితో దాడిచేశాడు. సహోద్యోగులు చూస్తుండగానే పలుమార్లు విచక్షణారహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దివాకర్‌ను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news