ప్రేయసిని చంపి పరారీకి యత్నం.. ట్రక్కు ఢీ కొని యువకుడి మృతి

-

మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఓ దారుణం చేసి పారిపోతున్న వ్యక్తి ట్రక్కు ఢీకొని మృతి చెందాడు. విధిని ఎవ్వరూ తప్పించుకోలేరు అనేందుకు ఇదో ఉదాహరణ. తుపాకీతో కాల్పులు జరిపి ప్రేయసి ప్రాణం తీసిన ఓ ఉన్మాది.. అక్కడి నుంచి పారిపోతూ ట్రక్కు ఢీకొని చనిపోయాడు.

కృష్ణయాదవ్‌ అనే వ్యక్తి.. నేహా అనే యువతిని ప్రేమించాడు. వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం బోయిసర్‌లోని రైల్వే ఫ్లైఓవర్‌ కింద ఉన్న నేహాపై.. కృష్ణయాదవ్‌ తుపాకీతో గురిపెట్టాడు. తలపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

నిందితుడు ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోతుండగా మొదట ఓ కారు ఢీకొట్టింది. అయినాసరే దాన్ని తప్పించుకుని పరుగు పరుగున ఇంకా ముందుకు వెళ్తుండగా.. ఆర్మీకి చెందిన ఓ ట్రక్కు ఎదురుగా వచ్చి అతడిని ఢీకొట్టింది. గాయపడిన అతడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news