మంచు లక్ష్మీ వదలబోతోన్న ‘మెట్రో కథలు’ ట్రైలర్..!

-

తెలుగు ప్రేక్ష‌కులను డిఫ‌రెంట్ కంటెంట్‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న ‘ఆహా’ తెలుగు ఓటీటీ మాధ్య‌మం తాజాగా ‘మెట్రో కథలు’ వెబ్ సిరీస్‌ను తీసుకురాబోతోంది. స్వాతంత్య్ర దినోత్స‌వ సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 14న ఈ మెట్రో కథలు ‘ఆహా’ యాప్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ‘మెట్రో కథలు’ ట్రైలర్‌ను బుధవారం సినీ నటి లక్ష్మి మంచు తన ట్విట్టర్ ఖాతా ద్వారా సాయంత్ర 6గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నారని ‘ఆహా’ ఓటీటీ ప్రకటించింది.

రాజీవ్ క‌న‌కాల‌, అలీ రేజా, స‌నా, నందినీ రాయ్‌, రామ్ మ‌ద్దుకూరి, తిరువీర్‌, న‌క్ష‌త్ర‌, గాయత్రి భార్గ‌వి త‌దిత‌రులు న‌టించిన ‘మెట్రో క‌థ‌లు’ను కిర‌ణ్ రెడ్డి మందాడి, రామ్ మ‌ద్దుకూరి నిర్మిస్తున్నారు. ‘ప‌లాస 1978’ చిత్రంతో ఘ‌న విజ‌యం సాధించిన డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ ‘మెట్రో క‌థ‌లు’ను తెర‌కెక్కిస్తున్నారు. ఇకపోతే న‌గ‌రంలో నాలుగు జంట‌ల మ‌ధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాల సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news