‘మా’ భవనంపై మరో వారంలో ప్రకటిస్తా : మంచు విష్ణు

-

మా అసోషియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు మ‌రో శుభ‌వార్త చెప్పారు. ‘మా’ భవనంపై మరో వారం లో ప్రకటిస్తాన‌ని స్ప‌ష్పం చేశారు మంచు విష్ణు. మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయని.. పేర్కొన్న మంచు విష్ణు… ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామా చేశార‌ని వెల్ల‌డించారు.

వారి రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరానని ఈ సంద‌ర్ఢంగా మంచు విష్ణు తెలిపారు. వారు అందుకు సిద్ధంగా లేకపోవడంతో రాజీనామాలను అంగీకరించడం జరిగిందన్నారు.
మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నామని.. రాజీనామా చేసిన వారు ‘మా’ సభ్యులుగా కొనసాగుతారని స్ప‌ష్టం చేశారు మంచు విష్ణు. నాగబాబు, ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యులుగా కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు.  కాగా.. మా అసోసియేషన్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో  ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ పై మంచు విష్ణు ప్యానెల్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news