ఆదిపురుష్ టీజర్ పై నేను అలా మాట్లాడలేదు – మంచు విష్ణు

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రాముడిగా బాలీవుడ్‌ ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్‌. అయితే.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. తాజాగా ఈ టీజర్‌ మంచు మనోజ్‌స్పందించినట్లు వార్తలు వచ్చాయి. “ఆది పురుష్ మేకర్స్ ప్రభాస్ ని, ప్రేక్షకులను మోసం చేశారు. అందరూ ఆది పురుష్ చిత్రాన్ని మామూలు సినిమా అనుకున్నాం. కానీ టీజర్ చూస్తేనే అసలు విషయం అర్థమైందన్నారు.

ఆది పురుష్ లోని విజువల్స్ చూస్తే కార్టూన్ సినిమాను చూసినట్టు అనిపించాయి. ఆడియన్స్ కు ముందుగానే విషయాన్ని చెప్పి వాళ్ళను ప్రిపేర్ చేయకుండా ఇలా మోసం చేయాలని చూస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది” అంటూ ఓ ఇంటర్వ్యూలో విష్ణు మంచు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన విష్ణు “అదొక ఫేక్ న్యూస్. ఎవరో ఐటెం రాజా, జిన్నా సినిమా రిలీజ్ కంటే ముందు ఆ ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నా సోదరుడు డార్లింగ్ ప్రభాస్ గురించి నేనెందుకు అలా మాట్లాడతాను” అంటూ రియాక్ట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news