మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి – సీఎం కేసీఆర్

-

ఏ ఎన్నికలలోనైనా పార్టీలు, నేతలు గెలుస్తున్నారు కానీ ప్రజలు మాత్రం ఓడిపోతున్నారని అన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ సరిగా పనిచేయలేదని ప్రజలు నరేంద్ర మోదీని, బిజెపిని 2014లో గెలిపించారని.. కానీ ప్రజలకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందన్నారు. మన్మోహన్ సింగ్ బాగా పనిచేసిన బిజెపి బద్నామ్ చేసిందన్నారు. మన్మోహన్ సింగ్ చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు సీఎం కేసీఆర్.

ఆయన పని ఎక్కువ, ప్రచారం తక్కువ చేశారని చెప్పుకొచ్చారు. మోడీ కంటే మన్మోహన్ చాలా మంచి పనులు చేశారన్నారు. మోడీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో రాజకీయం ఏంటని మండిపడ్డారు. నువ్వు ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే, నువ్వు ఎన్ని అంటూ మోడీ – రాహుల్ గొడవ పడుతున్నారని… దేశం పరిస్థితి క్రిటికల్ గా ఉంటే మోడీ మాట్లాడడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news