మోడీకి సలహాలు ఇచ్చే వాళ్ళు సరిగ్గా ఇవ్వాలి – KCR

-

ప్రధాని మోడీకి సలహాలు ఇచ్చే వాళ్ళు సరిగా ఇవ్వాలని సూచించారు సీఎం కేసీఆర్. కొద్దిగా మంచి పనులు చేయాలని మోడీకి చెప్పాలన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గోద్ర అల్లర్లపై డాక్యుమెంట్ చేస్తే బీబీసీని బ్యాన్ చేయాలా? అంటూ మండిపడ్డారు. బీబీసీ ని బ్యాన్ చేయాలని బిజెపికి చెందిన లాయర్ సుప్రీంకోర్టులో కేసు వేశారని తెలిపారు. ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం ఉండాలన్నారు సీఎం కేసీఆర్.

తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంకు తక్కువగా ఉందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అని కొట్టి పడేశారు. మన దేశం 3.3 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయింది అన్నారు. మొత్తం 192 దేశాలలో మన దేశం ర్యాంకు 139 అని తెలిపారు. 2024 తర్వాత బిజెపి ఖతం అన్నారు. బి.బి.సి ఈడీ, బోడికి భయపడుతుందా? అని ప్రశ్నించారు. వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో రూమ్ రెడీ చేసాము అంటారా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news