బాంబు పేలి మావోయిస్టు నేత మృతి.. చనిపోయిన ఏడాది తర్వాత ప్రకటన !

-

ప్రజల కోసం పోరాడే.. మావోయిస్టులలో మరో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాణం బాంబుల బాంబులను పరీక్షిస్తున్న సమయంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాణం బాంబులు మిస్‌ ఫైర్‌ కావడంతో బ్లాస్ట్‌ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్‌ రవి మరణించారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ లో లో టెక్ టీం కు సభ్యులుగా ఉన్నాడు రవి. అయితే మావోయిస్ట్‌ రవి చనిపోయిన సంవత్సరన్నర తర్వాత తాజాగా అధికారికంగా ప్రకటించింది మావోయిస్టు కేంద్ర కమిటీ. జార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన చేసింది. టెక్నికల్ టీమ్ లో కీలక సభ్యులుగా కొనసాగిన రవి… కమ్యూనికేషన్స్ తో పాటుగా ఎలక్ట్రానిక్ డివైస్ తయారు చేయడంలో దిట్ట అని సమాచారం అందుతోంది. ఇక అతని మృతి పట్ల మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ విచారం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news