భర్తను విడిచి ప్రియుడితో జంప్..అతడు హ్యాండ్ ఇవ్వడంతో..!

-

నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్య తన భర్తను విడిచి ప్రియుడితో కలిసి ఇంటినుండి వెళ్ళిపోయింది. ఈ నెల 22న వివాహిత భర్తను వదిలి శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడితో వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు కూతురును సైతం వెంట తీసుకుని వెళ్ళింది. కాగా ప్రియుడు ఆ వివాహిత ను మోసం చేసాడు. దాంతో మనస్తాపం చెందిన మహిళ 3 ఏళ్ల కూతురికి విషం తాగించి..తాను కూడా పురుగుల మందు సేవించింది.

దాంతో చిన్నారి క్యూటీ మృతి చెందగా ప్రస్తుతంతల్లి పరిస్థితి విషమం గా ఉంది. జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ఆత్మహత్య యత్నం చేసిన వివాహిత, కూతురును ఆస్పత్రికి తరలించగా కూతురు మృతి చెందగా..వివాహిత చికిత్స పొందుతోంది. బాధితులు సారంగా పూర్ (మం) బొరి గాం గ్రామానికి చెందిన వారు. భార్య ఇంటి నుండి వెళ్లిపోవడం తో ఆమె భర్త అవమానం భరించలేక ఊరు నుంచి వెళ్లి పోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news