ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మసూద చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

ప్రస్తుతం కార్తికేయ 2, కాంతారా వంటి సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతుండగా ఆ లిస్టులోకి ఇప్పుడు మరొక సినిమా కూడా చేరిపోయింది. తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన మసూదా చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మళ్లీ రావా, థ్రిల్లర్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి విభిన్నమైన కథలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన సినిమా మసూద. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ , సత్య ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మసూద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఓటీటీ లో ప్రేక్షకులను అలరించడానికి కూడా సిద్ధమయ్యింది. హారర్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన కావ్య కళ్యాణ్ రామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కనిపించింది కావ్యనే. ఇప్పుడు తాజాగా ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ మూవీని ఆహా భారీ ధరకు కొనుగోలు చేసిందని డిసెంబర్ 16 లేదా 23వ తేదీ నుంచి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కి ఉంచబోతున్నట్లు సమాచారం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 16న అవతార్ 2 సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో అదే రోజు మసూద చిత్రాన్ని ఓటీటీ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news